ఈనెల 10న జరగనున్న మెగా పెరంట్ టీచర్స్ మీటింగ్ను విజయవంతం చేయాలని చోడవరం మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి పిలుపునిచ్చారు. శనివారం చోడవరంఎంఆర్సి లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మెడికల్, ఫారెస్ట్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యావ్యవస్థపై పేరెంట్స్లో నమ్మకం కల్పించాలన్నారు.