చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గత సీజన్ లో సుమారుగా లక్ష 16 టన్నుల చెరుకు క్రషింగ్ చేయగా రైతులకు నేటి వరకు చెల్లింపులు జరపలేదని అఖిలపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే కార్మికులకు జీతాలు చెల్లించలేదన్నారు. ఈ మేరకు శనివారం బీజేపీ సీనియర్ నాయకులు ఏఆర్జీ శర్మ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎండీకి శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి షుగర్ ఫ్యాక్టరీకి రూ.35 కోట్లు తక్షణ సాయం అందించాలన్నారు.