ఏపీలో శనివారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెందిన జి.చరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా తగరపువలస గ్రామం కొండపేటకు చెందిన చరణ్.. పరీక్షల్లో తప్పానని తల్లిదండ్రులకు చెప్పాడు. వారుకూడా ఏం భయపడవద్దని, మళ్లీ పరీక్షలు రాయెుచ్చని ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.