దుబాయ్లో జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్-2025 పోటీల్లో విశాఖ యువతి దిశా పల్నాటి భారత్ తరఫున ప్రతిభ చూపి విజేతగా నిలిచింది. ఈ పోటీలో 19 దేశాల నుంచి 60 మంది పాల్గొన్నారు. నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో చదువుకొని, ప్రస్తుతం మణిపాల్ యూనివర్సిటీలో బీటెక్ చేస్తోంది. ఆమెకు మిస్ టీన్స్ గ్రాండ్ సీ 2025, ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ అవార్డులు లభించాయి. అందుకు తల్లి వాలెంటినా మిశ్రా పూర్తి సహకారం అందించారు.