జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో గురువారం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.