తిరుపతి తొక్కిసలాట ఘటనలో విశాఖకు చెందిన రజిని మృతి చెందింది. అయితే ఆమె తొలిసారి తిరుపతి వెళ్తున్నాడు ఆమె భర్త లక్ష్మణరెడ్డి తెలిపారు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని తెలిపారు. అస్వస్థతకు గురైన ఒక మహిళను ఆలయసిబ్బంది గేట్లు తీసి తనముందే తీసుకెళ్లారన్నారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో తన భార్య తప్పిపోయిందన్నారు.రెండు ఘంటల తర్వాత రూయాలో మృతదేహం కనిపించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.