విశాఖలోని కొండవాలు ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. వర్షం పడితే చాలు కొండ చరియలు విరిగి పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాలు ప్రాంతాల్లో బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో కొండ చరియలు పడి పలువురు మృతి చెందిన సంఘటనలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.