విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉత్తరాంధ్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. నేమాల హేమసుందర్కు మరొక అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయు) సంస్థ స్థాపించి ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో వివిధరంగాలలో ప్రతిభ చూపిన వ్యక్తులను గుర్తించి వారికి భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్మారక పురస్కారంతో సత్కరించనున్నారు