మధురవాడ: ఏసీబీ ఆఫీసర్ నంటూ మోసం.. నిందితులకు 14 రోజులు రిమాండ్

71చూసినవారు
మధురవాడ: ఏసీబీ ఆఫీసర్ నంటూ మోసం.. నిందితులకు 14 రోజులు రిమాండ్
మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారినంటూ బెదిరించిన కేసులో రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా నటించిన స్వర్ణలతను పీఎం పాలెం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి భీమిలి కోర్టులో హాజరుపర్చారు. బలగ సుధాకర్ తో పాటు ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించినట్టు సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. స్వర్ణలత ప్రస్తుతం బాపట్లలో రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం సెలవుపై ఉన్న ఆమెను విశాఖలోనే అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్