విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం కానుందని విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుందని, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.