మహిళా రక్షణకు కలసికట్టుగా అనే కార్యక్రమాన్ని హోం మంత్రి అనిత గురువారం విశాఖలో ప్రారంభించారు. ప్రేమ అనే ముసుగులో పడి యువత బలైపోతున్నారని, పోక్సో కేసుల్లో 20 శాతం మంది నిందితులు 20ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారన్నారు. 18 ఏళ్ల లోపు వాళ్లు 60శాతం ఉంటున్నారని చెప్పారు. స్వీయ క్రమశిక్షణ పేరుతో ఒక సబ్జెక్ట్ ను పాఠాల్లో చేర్చుతామని వివరించారు.