భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ద పరిస్థితుల నేపథ్యంలో విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ పరిధిలోని వసతి గృహాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పరీక్షలు ముగిసినందుకు విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి తమ స్వగ్రామాలకు వెళ్లాలని సూచించారు. నీటి ఎద్దడి, మెయింటెనెన్స్ పనుల కారణంగా హాస్టళ్లు మూసివేస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. త్వరలోనే ప్రారంభ తేదీని వెల్లడిస్తామన్నారు.