సిపిఐ 25వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపల్లి పైడిరాజు పిలుపునిచ్చారు. 10, 11 తేదీల్లో జరిగే మహాసభల్లో ప్రజా సమస్యలపై చర్చిస్తామన్నారు. 10న కంచరపాలెంలో బహిరంగ సభ, ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం విశాఖ తూర్పు నియోజకవర్గం లోని సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.