దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం, త్యాగం, దేశభక్తి నేటి తరానికి ఆదర్శనీయమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కూన రాంజీ అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం, ఎలకుర్రులో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ స్థాయి విశ్వదాత అవార్డును విశాఖపట్నంకు చెందిన సీనియర్ పాత్రికేయులు గంట్ల శ్రీనుబాబుకు వీసీ రాంజీ, పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు చేతుల మీదుగా అందజేశారు.