రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దత్తత దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వద్ద దక్షిణ నియోజక వర్గం శాసనసభ్యులు సి. హెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ అమ్మవారి రథోత్సవాన్ని శనివారం ప్రారంభించారు. అంబికాబాగ్ నుండి ప్రారంభమై జగదాంబ, పూర్ణామార్కెట్, కాలేజ్ డౌన్, కొత్తరోడ్ రీడింగ్ రూమ్ మీదుగా శ్రీ అమ్మవారి దేవస్థానంకు చేరుకొంది.