విశాఖ నగర పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ ఎమ్. ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ 3వ జోన్ 23వ వార్డు పరిధిలోని కె. ఆర్. ఎం కాలనీ ప్రాంతాలలో అకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరంలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు పరిశుభ్ర పరిచేలా చర్యలు చేపట్టాలన్నారు.