విశాఖలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియను పూర్తిచేయలేకపోయిందని, ఇప్పుడు జర్నలిస్టులకు మేలు జరగనున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.