గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో భాషోపాధ్యాయ (లాంగ్వేజ్ పండిట్లు) కేడర్ను రద్దు చేయడంతో వారంతా ఆరేళ్ల నుంచి త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు. ప్రస్తుతం మిగులు ఉపాధ్యాయులగా డీఈవో పూల్లో ఉన్న వారిని విద్యా శాఖ ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు పంపిస్తోంది. ఏదైనా ఒక పాఠశాలలో టీచర్ దీర్ఘకాలిక సెలవుపై లేదా పదోన్నతిపై వెళ్లిపోతే ఆ స్థానంలో తాత్కాలికంగా పనిచేయాలని ఆదేశాలు ఇస్తోంది.