విశాఖ: ఇక్కడ మోకాళ్ల నొప్పులకు 'ప్లాస్మా' చికిత్స

68చూసినవారు
విశాఖ: ఇక్కడ మోకాళ్ల నొప్పులకు 'ప్లాస్మా' చికిత్స
విశాఖలోని విమ్స్ ఆస్పత్రి (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ) కేజీహెచ్ కు ప్రత్యామ్నాయంగా మారబోతోంది. ఇక్కడ మోకాళ్ల నొప్పులకు అత్యాధునిక ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉందని శుక్రవారం ఆ విభాగాధిపతి డా. భవానీ ప్రసాద్ తెలిపారు. ఇదే చికిత్స బయట చేయించుకోవాలంటే రూ. వేలల్లో ఖర్చవుతుందన్నారు. ప్లాస్మా చికిత్స అందిస్తున్న తొలి ప్రభుత్వాసుపత్రి కూడా ఇదేనని విమ్ డైరెక్టర్ డా.కె.రాంబాబు చెప్పారు.

సంబంధిత పోస్ట్