విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోలో పర్యటించిన , ప్రసంగించిన కార్యక్రమ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జోన్ 3 లో సిరిపురం జంక్షన్ నుండి వేంకటాద్రి వంటిల్లు మీదుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు షోలో పర్యటించిన ప్రాంతాలను అధికారులతో కలసి పరిశీలించారు.