విశాఖ నగర జనసేన అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అమరావతిలో బుధవారం మంత్రి లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నియోజకవర్గంలో పలు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అర్హుల అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని మంత్రి లోకేష్ సూచించారని తెలిపారు.