విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన ఈ సమావేశానికి ఛైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె. ఎస్. విశ్వనాధన్, ఇతర విభాగాధిపతులు హాజరుకాగా, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ వర్చువల్గా పాల్గొన్నారు. పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.