చదువు విజ్ఞానాన్ని పంచితే, క్రీడలనేవి మానసిక స్థైర్యాన్నిస్తాయని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అన్నారు. గాజువాక సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 11 నుంచి జూన్ 8 వరకు నాలుగు విభాగాల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం సోమవారం సాయంత్రం 65 వ వార్డు, కాకతీయ స్కూల్ ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథిగా గోవింద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వేసవిలో సమయాన్ని వృధా చేయవద్దన్నారు.