గాజువాక శ్రీనగర్ చర్చ్ క్రైస్తవ కుటుంబాల్లోని కొంతమంది నిరుపేదలకు జనసేన ఆధ్వర్యంలో పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన సీనియర్ నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట రావు, సోమన్న, 69వ వార్డు సీనియర్ నాయకులు గోపిశెట్టి వెంకట్రావు పాల్గొని.. చీరలు పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనసేన నేతలు వివరించారు.