నగరంలోని ప్రధాన రహదారులపై ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. విశాఖ రీజియన్కు నాలుగు విడతల్లో 200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అందులో మొదటి విడత 50 బస్సులు త్వరలో పంపనున్నట్టు ఆర్టీసీ విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందింది. మొదటి విడత వచ్చిన ఈ-బస్సులను సింహాచలం, గాజువాక, మధురవాడ డిపోలను కేంద్రాలుగా చేసుకొని నడపాలని నిర్ణయించారు.