విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఆపాలని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 16 నిరవధిక సమ్మెకు దిగేందుకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు శుక్రవారం ప్రకటించారు. విశాఖ స్టీల్ప్లాంట్లో గత మూడు మాసాల్లో 3వేలమందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించిందని చెప్పారు.