ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు విశ్వబ్రాహ్మణులను తక్కువ చేసి చూపిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.