గాజువాక వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన పెద్ద కుమారుడు వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని వ్యాఖ్యానిస్తూ శోకాలు పెట్టారు. వైసీపీ కార్పొరేటర్ గా గెలిచి.. నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో తన తనయుడు వంశీ రెడ్డి చేరికపై తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.