జూన్ 21న విశాఖపలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ అనే ప్రధాన థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. జూన్ 21న ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సుమారు 45 నిమిషాల పాటు ఈ వేడుక కొనసాగనుంది.