దేశంలోని కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసే ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలన్న డిమాండ్లతో ఈనెల 20న నిర్వహించనున్న సమ్మెలో కార్మికులు రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు జిల్లా కోశాధికారి వీవీ శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. శుక్రవారం చీడికాడలో సీఐటీయూ మండల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.