దేవరాపల్లి మండలం ఏం.అలమండలో 19.70లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులుతో నిర్మించనున్న సామాజిక భవనం, సిసి రోడ్లు కాలువలు నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. దేవరాపల్లిఎంపీపీ చింతల బుల్లి లక్ష్మి, దేవరాపల్లి మండల జడ్పీటీసి కర్రి సత్యం, దేవరాపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంచాడ సింహాచలం నాయుడు, దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావులు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.