దేవరాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలనుండి మాడుగుల నియోజకవర్గ శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి వినతలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే పరిష్కారానికి సంబంధిత అధికారులకు తమ సూచనలు చేశారు. సమస్యలు ఎక్కడెక్కడ పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.