ప్రజలకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ రాయపరెడ్డి కృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం మాడుగుల మండలంలోని ఘాట్ రోడ్డు జనసేన పార్టీ కార్యాలయం వద్ద క్రియాశీల సభ్యత్వం నమోదు కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 5200 క్రియాశీల సభ్యత్వాలు నమోదు కాగా, మాడుగుల మండలంలోనే 3000 సభ్యత్వాలు నమోదయ్యయన్నారు.