విశాఖపట్నంలో బుధవారం జరిగిన ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని నియోజకవర్గంలో గల సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. రహదారులు, రవాణా సౌకర్యాలు, సాగునీటి వనరులు, మంచినీటి సౌకర్యం, విద్య వైద్యం వంటి వివిధ అంశాలను ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి తగు సహకారం అందించాలని కోరారు.