దేవరాపల్లి మండలం దేవరాపల్లి, వాకపల్లి పంచాయతీలో ఉపాధి హామీ కూలీలు పెండింగ్ లో ఉన్న బిల్లులు చేల్లించాలని కోరుతూ గురువారం చేతులెత్తి దండం పెడుతు నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్, బాబు చర్యలు చేపట్టాలని నిరసన తెలిపారు. విరికి మద్దతుగా వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి. వెంకన్న మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 55 కోట్లు ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చేల్లించాలని డిమాండ్ చేసారు.