మాడుగుల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 30 మందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేయగా అందులో మాడుగులకి అప్పలరాజును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణకు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు