చీడికాడలో పశు గణన కార్యక్రమం తనిఖీ

79చూసినవారు
చీడికాడలో పశు గణన కార్యక్రమం తనిఖీ
చీడికాడ మండలం జైతవరం గ్రామంలో జరుగుతున్న 21వ పశు గణన కార్యక్రమాన్ని శుక్రవారం మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. వి.చిట్టి నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ పశు గణన జరుగుతుందన్నారు. కాబట్టి ప్రజలు తమ పశు సంపద వివరాలు, పశు సంవర్ధక శాఖ సిబ్బందికి అందించి సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్