ఈ నెల 11న పాలిటెక్నిక్ ప్రవేశాల కొరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుందని నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు మంగళవారం తెలిపారు. ఈ వెరిఫికేషన్ కార్యక్రమం విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుందని చెప్పారు. 11వ తేదీ నుంచి 13వరకు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంక్ వరకు వెరిఫికేషన్ జరుగుతుందని, అలాగే 11 నుంచి 14 వరకు ఆప్షన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చన్నారు.