రాజమండ్రిలో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో నర్సీపట్నానికి చెందిన బీజేపీ నాయకులు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ ఎర్రం నాయుడు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా జరిగిన రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగా నాయకులు అనేక సూచనలు చేశారన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.