నర్సీపట్నం: ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

73చూసినవారు
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు కొరత లేకుండా చూడాలని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద సూచనల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని సిబ్బంది ప్రసాద్ తెలిపారు. సుమారు 100 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి పలువురు స్వచ్ఛందంగా వచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్