నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వైసిపిని స్థాపించినట్లు పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.