రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్పీకర్ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి, కుమారుడు చింతకాయల విజయ్, రాజేష్, కోడళ్లు సువర్ణ, దివ్య పాల్గొన్నారు