దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ మృతి పట్ల స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్, జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన బాంబు దాడిలో వీరమరణం పొందారన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.