ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రా–2025 కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్కే బీచ్ వద్ద శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి యోగా సాధనలు చేసి, యోగాతో కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. జూన్ 21న జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.