జమ్మూ కాశ్మీర్లోని ఇండియా-పాకిస్తాన్ యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం తీవ్ర బాధ కలిగిందని వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె. కె. రాజు అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన సంతాపం తెలియజేశారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం దేశానికే ఎంతో గర్వ కారణం. ఆయన కుటుంబానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కె. కె. రాజు తెలియజేశారు.