విశాఖ: దేశీయ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరం

80చూసినవారు
విశాఖ: దేశీయ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరం
దేశీయ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరమని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం, ద్వారకానగర్లోని పౌర గ్రంధాలయంలో వరికంకుల గుత్తులు తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ, విత్తనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు 130 రకాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసామన్నారు. దేశీయ విత్తనాల సేకరణ, పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్