వైజాగ్ గాంధీ పార్కు వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్, జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష శిబిరం నిర్వహించి 1500 రోజుల అయింది. ఈ సందర్భంగా గాజువాక జీవిఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ గొలగాని అప్పారావు మాట్లాడుతూ, కార్మికుల శ్రేయస్సు, దేశ రక్షణ కోసం ప్రభుత్వ సంస్థలు కాపాడుకోవాలి అని అన్నారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన చేయాలి అని కోరారు.