అప్పుల బాధ తాళలేక సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ పట్టణంలో జరిగింది. మృతుడు అతని భార్య జయశ్రీలు ఇద్దరు పిల్లలతో ప్రకాశనగర్ లో నివాసం ఉన్నారు. సంతోష్ కుమార్ ఈ ఏడాది జనవరిలో ఉపాధిలో భాగంగా విదేశాలకు వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత అప్పుల బారిన పడటంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి
వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.