చింతపల్లి: ఏరియా ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా అధికారి

71చూసినవారు
చింతపల్లి: ఏరియా ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా అధికారి
చింతపల్లి మండలంలోని అల్లూరి జిల్లా మలేరియా అధికారిణి తులసి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. చింతపల్లి పెదవలస ఏరియా ఆస్పత్రితోపాటు సీలేరు సబ్ యూనిట్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు మందుల స్టాక్ ను పరిశీలించారు. రోగులతో ముఖాముఖి మాట్లాడి వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ. దోమల వల్ల కలిగే అనర్ధాలపై వివరించి, సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్