గూడెంకొత్తవీధి మండలంలోని పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ రహదారిలో శనివారం సిమెంట్ లారీ బురదలో కూరుకుపోవడంతో అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశా చిత్రకొండకు వెళ్తున్న లారీ వంతెన నిర్మాణం తర్వాత అప్రోచ్ రోడ్డు మట్టితో నింపిన కారణంగా వర్షాలకు బురదగా మారింది. దీంతో లారీ బురదలో ఇరుక్కుపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.